ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,408 కరోనా పాజిటివ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 05, 2021, 10:33 AM

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,408 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 120 మంది మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,08,02,591కి చేరింది. అలాగే దేశంలో 1,54,853 కరోనా మరణాలు సంభవించాయి. 1,51,460 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.16% శాతం, మరణాల రేటు 1.43%శాతంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa