అప్పట్లో భోజనం చేసేటప్పుడు చివర్లో పెరుగో, మజ్జిగో తీసుకోకుండా భోజనం ముగించేవారు కాదు. మరి ఇప్పుడు ఏదో ఒక కర్రీ వేసుకోవడం, చివర్లో పెరుగా వద్దులే ఆసక్తి లేదు అని ముగించేయడం చాలా మందికి అలవాటైపోయింది. పెరుగును చూడగానే అదేదో తినకూడని పదార్థంలా ఫీలయ్యేవారూ ఉన్నారు. అసలు విషయమేంటంటే ఆ పెరుగే ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది. భోజనం చేసిన ప్రతిసారీ ఎవరైతే పెరుగు లేదా మజ్జిగతో ముగిస్తారో వారి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెరుగు తప్పనిసరిగా తినండి. తద్వారా మీ బాడీలో జీర్ణక్రియ చాలా మెరుగవుతుంది. మీకు మలబద్ధకం, పైల్స్ సమస్యలుంటే పెరుగు చాలా మేలు చేస్తుంది. ఇలాంటి ఎన్నో అనారోగ్యాలకు ఒకటే మంత్రం పెరుగు. పెరుగులో నిండా బ్యాక్టీరియా ఉంటాయి. అవి పొట్టలోకి వెళ్లాక లోపలున్న విష వ్యర్థాలు, ఇతరత్రా చెత్తా చెదారాన్ని తినేస్తాయి. మొత్తం క్లీన్ చేస్తాయి.
ఫలితంగా మనం తినే ఆహారం సంపూర్ణంగా జీర్ణమై ఆహారంలోని అన్ని పోషకాలూ రక్తంలో కలిసి అక్కడి నుంచి బాడీ మొత్తం వ్యాపించి మనం సంపూర్ణమైన వ్యాధి నిరోధక శక్తిని పొందుతాం. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మనకు మేలు చేసే రకం. ఇది రకరకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. మానసికంగా అలసట, నీరసం వంటివి పెరుగుతో పోతాయి. చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం మలబద్ధకం, అజీర్ణం వంటివే. తినే ఆహారం సరిగా జీర్ణమైతే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. తద్వారా బాడీలో అన్ని అవయవాలూ బాగా పనిచేస్తాయి. బ్రెయిన్ బాగా పనిచేసేలా, ఒత్తిడి, టెన్షన్, ఆదుర్తా వంటివి పోగొట్టడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. అలసట, ఒత్తిడి పెరిగితే బరువు కూడా పెరుగుతారు. అధిక బరువు ఉండేవారు ఏమీ తినకపోయినా పెరుగు మాత్రం మానొద్దు. రోజూ రెండు పూటలో భోజనం చివర్లో పెరుగుతింటే చాలు. ఒంట్లో చెత్త కొవ్వును కరిగించి మొత్తం క్లీన్ చేసే పని పెరుగులో బ్యాక్టీరియా చూసుకుంటాయి. దీనిపై జరిపిన పరిశోధనలో ఏం తేలిందంటే అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్గా పెరుగు తింటే 22 శాతం బరువు తగ్గుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa