రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.16,000 కోట్లు కేటాయించింది. రైతులు తమ పంటలకు బీమా పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.305 కోట్లు ఎక్కువగా కేటాయింపులు వచ్చాయని..దేశంలో వ్యవసార రంగ అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది.
కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 2016 జనవరి 13న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. అకాల వర్షాలు, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు తమ పంటను నష్టపోతుంటారు. రైతు తన పంటకు బీమా తీసుకునే సదుపాయాన్ని ఈ పథకం కల్పిస్తుంది. విత్తనాలు నాటడం దగ్గర్నుంచి పంటకోతల వరకు ఎప్పుడు ఎలాంటి నష్టం వచ్చినా ఈ పథకం ద్వారా బీమా లభిస్తుంది. అన్ని రకాల ఆహార పంటలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏటేటా 5.5 కోట్ల మంది రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేస్తుంటారు. వీరిలో 84 శాతం మంది చిన్న రైతులే. బీమా పొందేందుకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. హార్టికల్చర్ పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa