ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 10, 2021, 10:42 AM

జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశభవనంలో ఎన్నికల కంట్రోల్ రూమ్/వార్ రూమ్ లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. ఫకీరప్పతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్ మాట్లాడుతూ తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. 


మొదటి విడతలో 193 గ్రామ పంచాయతీలకు గాను 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని మిగిలిన142 గ్రామపంచాయతీలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారన్నారు.  మొత్తం 3,21,312 ఓటర్లు ఉండగా  2,63,934 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా.....82.14%  నమోదయ్యాయన్నారు. కోవిడ్ వున్నప్పటికీ నిబంధనలు పాటించి ప్రజలు అధిక సంఖ్యలో  ఓటు వేసేందుకు ముందుకు వచ్చి పాల్గొన్నారన్నారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ కష్టపడి రాత్రింబవళ్లు పని చేశారన్నారు. ఇదే రీతిలో కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతంగా పూర్తి చేయడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించి విజయవంతం చేసేందుకు కృషి చేసిన జిల్లా అధికారులు, మండల అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. 


 


జిల్లా ఎస్పీ కె. ఫకీరప్ప మాట్లాడుతూ 12 మండలాల్లో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఫ్యా క్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులు,విజయోత్సవ ర్యాలీలు, సభలు, బాణా సంచా కాల్చడం, డప్పులు వాయించడం తదితర వాటిని నిషేధిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa