ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మగడ్డ ఊళ్ళో వైసిపి మద్దతుదారు గెలుపు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 10, 2021, 10:52 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ స్వగ్రామంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన గృహం ఉన్న వార్డులో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపొందారు. గ్రామ సర్పంచ్‌ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత వార్డులో వైఎస్సార్‌సీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa