ఏపీలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. బుధవారం సెక్రటేరియట్ లో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. క్రికెట్ లో కెప్టెన్ మాత్రమే గెలవలేడు, జట్టు సభ్యులందరూ కలిసి ఆడితేనే గెలుస్తాం.. అలాగే మీ అందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నామని తెలిపారు. ఖర్చును కూడా తగ్గించుకుంటున్నామని, జ్యుడిషయల్ ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతిని రూపుమాపుతున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, భూముల రీసర్వే… గతంలో ఎప్పుడూ చేయనివని వెల్లడించారు.
నేరుగా నగదు బదిలీద్వారా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. 30 లక్షలకు పైగా ఇళ్లపట్టాలను ఇచ్చామని చెప్పారు. 20 నెలల కాలంలో అనేక కలల్ని నిజం చేశామని తెలిపారు. అధికార యంత్రాంగం మనసు పెట్టి పని చేసి ఈ పనులు చేయగలిగిందన్నారు. 20 నెలల కాలం గడిచింది. ఇప్పుడు క్రికెట్ లో మాదిరిగా మిడిల్ ఓవర్ల కాలం వచ్చిందని చమత్కరించారు. ఈ సమయంలో మనం మళ్లీ మన దృష్టిని కేంద్రీకరించుకోవాల్సి ఉందన్నారు. శాఖల మధ్య సమన్వయం సాధించాలని తెలిపారు. వీటన్నింటి మీద మనం దృష్టిసారించాలని చెప్పారు. .
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఓన్ చేసుకోవాలన్నారు. అక్కడకు వస్తున్న వినతులపై పూర్తిగా అధికార యంత్రాంగం నుంచి స్పందన ఉండాలని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పకుండా పథకాలు అందాలని, ఆ విషయంలో వాలంటీర్లది కీలక పాత్ర అన్నారు. వాలంటీర్లది సేవ, వారిని మోటివేట్ చేయాలని తెలిపారు. ఉగాది రోజు ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లను సత్కరించాలని, వారి సేవలను గుర్తిస్తూ వారికి సత్కారం చేయాలని సూచించారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa