తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల 8న హత్యకు గురైన రెడ్డెం శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతుండగా ఇంతలోనే ఆయన భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఒకవైపు తండ్రి హత్యకు గురవ్వడం..మరోవైపు తల్లి ఆత్మహత్యకు పాల్పడటంతో చిన్నారులు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని శ్రీపాదవల్లభ మహా సంస్ధానం ఎదురుగా ఉన్న వీధిలో నివసించె రెడ్డం శ్రీనివాస్ (45) ను ఈనెల 8న గుర్తు తెలియని వ్యక్తులు మంచానికి కాళ్లు చేతులు కట్టేసి తలపై రాడ్డుతో దారుణంగా కొట్టి హత్య చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 12 శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాస్ భార్య స్వరూపరాణి (30) నీరసంగా ఉందని చెప్పి లోపలి గదిలోకి వెళ్లి పడుకుంది. కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు చూస్తే ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే వారు పోలీసులకు సమచారం అందించారు. తండ్రి సత్తిరాజుతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకునే శ్రీనివాస్ కు మొదట భార్య చనిపోవటంతో స్వరూప రాణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు ఉండగా…స్వరూపరాణి ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. ఐదురోజుల వ్యవధిలో భార్య భర్తలిద్దూర కన్నుమూయటంతో పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa