ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ కేంద్రంలోనే పురుటి నొప్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 13, 2021, 04:25 PM

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ కుటుంబానికి పంచాయతీ ఎన్నికలు అదృష్టాన్ని తీసుకొచ్చాయి. ఓ సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ రోజే పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో బట్టు లీలాకనకదుర్గ నామినేషన్ వేశారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. 9నెలల గర్భంతోనే ఇంటింటికీ తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికల సందర్భంగా గ్రామంలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు తనకే ఓటు వేసుకొని బయటకొచ్చిన ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కనకదుర్గ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. సర్పంచిగా పోటీచేసి ఓటు వేసిన రోజే బిడ్డ పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కనకదుర్గ తెలిపారు. పాపతో పాటే సర్పంచ్ పదవి కూడా ఇంటికొస్తుందని కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు. మరి ఫలితాలు రావడానికి కొద్దిగంటల ముందే పాప జన్మించడంతో ఎన్నికల్లో గెలుపు కూడా తథ్యమని కనకదుర్గ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఆ బుజ్జిపాప కళ్లు తెరవకుండానే తన కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa