ఏపీలో మరో ఎన్నికలకు నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలు ఈనెల 21తో ముగియనున్న నేపథ్యంలో మరో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 10న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. మున్సిపల్ ఫలితాలు మార్చి 14న వెల్లడి కానున్నాయి. ఇకపోతే గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 3 మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ప్రకటించింది.
ఇకపోతే మార్చి3న పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. అలాగే పోలింగ్ లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే మార్చి 13న రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. పోలింగ్ మార్చి 10న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇకపోతే కౌంటింగ్ మార్చి 14న ఉదయం 8 గంటల తర్వాత మెుదలు కానున్నట్లు ఎస్ఈసీ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం ఎస్ఈసీ ఏకాభిప్రాయానికి వచ్చింది. పురపాలక సంఘాల ఎన్నికలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 15న అంటే సోమవారం పురపాలక సంఘాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఎస్ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa