కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్థాకరే ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డిఆర్ఎఫ్)ని అందించడంతో .. మహమ్మారి నుండి ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మందులు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో... సైన్యం సహాయం అందించాలని ఉద్ధవ్థాకరే ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ తరహా నిబంధనలు విధించారు. అదే సమయంలో లాక్డౌన్ ద్వారా ఉపాధికోల్పోతున్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు సహాయం అందించేందుకు రూ. 5,476 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
భూకంపం, తుఫానులు, వరదల వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినపుడు తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాల ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం నిధిని ప్రకటిస్తాయని అన్నారు. అదేవిధంగా కరోనాను కూడా ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని అన్నారు. కాగా, ఉద్ధవ్థాకరే లేఖ రాసినట్లు ప్రధాని మోడీ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే ధృవీకరించారు. ఈ లేఖపై ఆయన స్పందిస్తూ.. మహమ్మారి ఒక విపత్తు వంటిదే.. అయితే దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించలేదని.. దీంతో రాష్ట్రాలకు నిధిని కేటాయించలేమని అన్నారు. మహమ్మారిని ప్రకృతి విపత్తుగా పరిగణించడం అనేది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని. కేంద్రం పిలుపునివ్వాల్సి వుంటుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa