ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో మహిళ దారుణ హత్య..

national |  Suryaa Desk  | Published : Thu, Apr 22, 2021, 11:57 AM

కర్ణాటకలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని కోలారు తాలూకాలోని నాగనాయకనహళ్లి గ్రామానికి చెందిన నీలవేణికి 29 సంవత్సరాలు. కోలారులోని మహాలక్ష్మీ లేఅవుట్ లో భర్త,ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తుంది. కోలారులోనే నీలవేణి ఫ్యాన్సీ స్టోర్ ను నడుపుతుంది. బుధవారం షాపు తెరిచి నీలవేణి సామాను సర్దుకుంటుంది. ఇంతలో కొంత మంది దుండగులు షాపులోకి చొరబడి నీలవేణి పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు.


తీవ్ర రక్తస్రావం కావడంతో నీలవేణి షాపులోనే ప్రాణాలు కోల్పోయింది. నీలవేణిని ఇంత కిరాతకంగా ఎవరు చంపి ఉంటారన్న ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పోలీసులు సీసీ టీవీలు,డాగ్ స్క్వాడ్ ద్వారా రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa