కరోనా కాటుకు మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాల్సిందే. అయితే కొంత మందికి అవగాహన లేక పోవడం, అమాయకత్వంతో మాస్క్ ను మరిచిపోతున్నారు. ఇదిలా ఉంటే మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ రెచ్చిపోయిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మాస్క్ పెట్టుకోలేదంటూ వయసు మళ్లిన ఓ వలస కార్మికుడిని రక్తం వచ్చేలా కొట్టాడు. ఏప్రిల్ 22న అంగమలె బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. వృద్ధుడిపై డ్రైవర్ చేసిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఉన్నతాధికారులు హుటాహుటిన సదరు డ్రైవర్ ను విధుల్లో నుంచి తొలగించారు.
ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. లాక్ డౌన్ భయంతో వలస కార్మికులు బిక్కుబిక్కుమంటూ తమ సొంత ఊళ్లకు ప్రయాణమౌతుంటే ఇలా రాక్షసంగా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. మాస్క్ పెట్టుకోవాలని మాట రూపంలో చెప్పాలి, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి కాని ఇలా కృూరంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా కేరళలో వలస కూలీలపై దాడి ఇదేం కొత్త కాదు. 2020 ఫిబ్రవరిలో పశ్చిమ బెగాల్ కు చెందిన మాణిక్ రాయ్ అనే 50 ఏళ్ల వృద్ధ వలస కార్మికుడిపై కోడిపెట్టను దొంగిలించాడన్ననెపంతో ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన మాణిక్ రాయ్ అన్యాయంగా ప్రాణాలు విడిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa