ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూతపడ్డ పరిశ్రమను తెరిచేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

national |  Suryaa Desk  | Published : Tue, Apr 27, 2021, 03:52 PM

తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్‌ కర్మాగారాన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తిరిగి తెరవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణవాయువు ఉత్పత్తి నిమిత్తం పరిశ్రమను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని వేదాంతా గ్రూప్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 రోజుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తిని మొదలుపెట్టగలమని వేదాంతా గ్రూప్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కర్మాగారం తెరవడానికి అనుమతి ఇచ్చింది. అయితే కేవలం ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. ఉత్పత్తిపై నిపుణుల కమిటీ పర్యవేక్షణ ఉండాలని సూచించింది. కాగా కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో 2018లో ఈ పరిశ్రమను ప్రభుత్వం క్లోజ్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa