కన్నతండ్రి రాక్షసత్వానికి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దంపతుల మధ్య చెలరేగిన వివాదానికి కన్న కూతురు బలి కావాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ కొత్తపేటలో జగ్గుపిళ్ల రాజా(35), యుగంధరి దంపతులు ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల పాప ఉంది. ఓ మెడికల్ షాప్ లో పని చేసే రాజా 3 నెలల నుంచి పనికి వెళ్లడం లేదు. పని చేయకుండా ఉంటే ఇళ్లు ఎలా గడుస్తుందని భర్తను నిలదీసింది భార్య. దీంతో ఈ విషయంలో ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు. విసిగిపోయిన భార్య వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో పంచాయతీ పెడతానంటూ గురువారం నాడు కూతురును తీసుకుని పక్కనే ఉండే తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత కూతుర్ని ఇంటికి పంపాలని భార్యకు రాజా ఫోన్ చేశాడు. ముందుగా కూతురిని ఇంటికి పంపిన భార్య ఆ తర్వాత తాను కూడా వచ్చింది. కాసేపు మాట్లాడుకున్నాక ఆ చిన్నారిని అక్కడే వదిలేసి తిరిగి తల్లి ఇంటికి వెళ్లింది. ఆసమయంలో పంచంపై పడుకుని సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుతోంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టున్న రాజా ఒక్కసారిగా కూతురి మొఖంపై మెత్త దిండును అడ్డుగా ఉంచి ఊపిరి ఆడకుండా చేశాడు. గిలగిలా కొట్టుకుంటూ ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాసేపటికి వచ్చిన భార్య మంచంపై కూతురు నిర్జీవ స్థితిలో పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య ఫిర్యాదుతో రాజా పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa