ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైట్ రైడర్స్‌ ఆటతీరు పై సెహ్వాగ్ ట్వీట్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 11:51 AM

అహ్మదాబాద్: కోల్‌కత నైట్ రైడర్స్.. డిఫెండింగ్ ఛాంపియన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా.. టైటిల్ హాట్ ఫేవరెట్‌గానే ఉంటుంది. దానికి ధీటుగా ఆడుతుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌పై ఆడాలంటే ఎలాంటి జట్టయినా ఒకటికి రెండుసార్లు వ్యూహాలను చెక్ చేసుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకుంటుంది. ఏ సీజన్‌కు ఆ సీజన్ మరింత రాటుదేలాల్సిన కోల్‌కత టీమ్.. ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. గత ఏడాది ప్లేఆఫ్ చేరకుండానే ఇంటిదారి పట్టిన మోర్గాన్ టీమ్‌కు ఈ సారి కూడా అదే అవమానం తప్పకపోవచ్చు.


గురువారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌.. నైట్ రైడర్స్ నాసిరకం ఆటతీరుకు అద్దం పట్టింది. బ్యాటింగ్‌లో ఏ మాత్రం రాణించలేకపోయింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ చెలరేగిపోయి ఆడకపోయి ఉంటే.. ఆ మాత్రం పరుగులు కూడా స్కోర్ కూడా సాధ్యం అయ్యేది కాదు. ఆండ్రీ రస్సెల్.. 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa