ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 04:40 PM

మన బడి నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్ష చేసారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేసారు. ఆయన మాట్లాడుతూ రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్‌ వేయాలని సూచించారు. నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్‌లో నాడు ఆ స్కూల్‌ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.


అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుందని వాటి ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుందన్నారు. స్కూళ్లలో పెయింటింగ్‌ పనులు, స్మార్ట్‌ టీవీలు, వాల్‌ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలని సూచించారు. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదని అందుకే పేరెంట్స్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా, ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణను కూడా సీఎం వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa