అమరావతి: కొవిడ్ రెండో దశలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. తొలిదశలో ఏపీ ఆర్థిక వృద్దిరేటు 4.3 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా రెండో దశలో ఏపీలో తిరోగమన వృద్ధి ఖాయమని చెప్పారు. కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఏపీకి చేటు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి గండికొట్టి.. పేదల ఉపాధి, రాబడులను చావు దెబ్బ తీశారన్నారు. ద్రవ్యలోటు, అధిక అప్పులే జగన్ ఘనత అని ఎద్దేవా చేశారు. తిరోగమన పాలకుడిగా జగన్ పేరు రికార్డుల్లో నిలిచిపోతుందని యనమల అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa