ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టపగలే వేటకొడవళ్లతో వేటాడి వెంటాడి మరి నరికారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 17, 2021, 02:55 PM

అనంతపురం జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆస్తుల వివాదంలో ఇద్దరు వ్యక్తుల పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం దిగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కేశవ, గంగరాజులు ఈరోజు ఉదయం సరుకులను కొనడానికి బైక్‌పై ముదిగుబ్బ కు వెళ్లారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. యోగివేమన జలాశయం వద్దకు వెళ్లగానే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో వీరి పై దాడి చేశారు. ఈ దాడిలో కుమ్మరి కేశవ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్తుల వివాదం నేపథ్యంలో ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa