ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లఢక్‌లో 3.6 తీవ్రవతతో భూకంపం

national |  Suryaa Desk  | Published : Sat, May 22, 2021, 10:23 AM

 కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లో వరుస భూకంపాలు వస్తున్నాయి. నిన్న 4.2 తీవ్రతతో భూకంపం రాగా, తాజాగా ఇవాళ ఉదయం 8.27 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియరాలేదని పేర్కొంది.


శుక్రవారం ఉదయం 11.02 గంటల ప్రాంతంలో కూడా లఢక్‌లో భూ కంపం వచ్చింది. జమ్ముకశ్మీలోని దోడా ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 2.34 గంటలకు భూమి కంపింది. దీని తీవ్రత 3.2గా నమోదయ్యింది ఎన్‌సీఎస్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa