ఈ ఏడాది సైతం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. వ్యాక్సినేషన్ పూర్తయిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. గతేడాది సైతం కరోనాతో జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే సాగిన విషయం తెలిసిందే. గతేడాది సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈ ఏడాది పాటిస్తామని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కె జెనా తెలిపారు. 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్ రిప్టోర్, పూర్తిగా టీకాలు వేసిన వారికి మాత్రమే జగన్నాథుడి, బలభద్రుడు, సుభద్రల రథాలను లాగేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి రథాన్ని 500 మందికి మించకుండా లాగుతారని పేర్కొన్నారు. ఆలయ ఆచారాలు చేసేందుకు కరోనా నెగెటివ్, టీకాలు వేసిన వారికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. యాత్ర సమయంలో పోలీసు అధికారులు సైతం ఇవే ప్రమాణాలు పాటించనున్నారు. ఈ ఏడాది జగన్నాథుడి రథయాత్ర జూలై 12న ప్రారంభంకానున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa