ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశికళ రీ ఎంట్రీపై అధిష్ఠానందే నిర్ణయం: పన్నీర్ సెల్వం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 06:54 PM

ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రీ ఎంట్రీపై.. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తిరిగి ఏఐఏడీఎంకేలో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు, వెళ్లిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.


ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఇటీవల తన పేరుతో ఒక ఫలకాన్ని తయారు చేయించారు. ఆ ఫలకాన్ని పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీ రామంచంద్రన్ మెమోరియల్ వద్ద ఆవిష్కరించారు. ఆ ఫలకంపై శశికళ ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ అని రాయించుకున్నారు. దీనిపై అన్నాడీఎంకే గత వారం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో శశికళ అన్నాడీఎంకేలో చేరుతున్నారా..? అన్నా మీడియా ప్రశ్నకు పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa