దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. కరోనా మహమ్మారి సమయం లో క్యాష్ బదులు ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు కూడా అదే అనుసరిస్తున్నారు. అయితే దీంతో సైబర్ క్రిమినల్స్ కూడా బ్యాంక్ ఖాతాదారులను టార్గెట్ చేయడం జరిగుతోంది. మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఖాతాదారులను హెచ్చరించింది బ్యాంక్. అలానే సేఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి పలు సూచనలు కూడా చేసింది బ్యాంక్. ఎవరు కూడా విలువైన బ్యాంక్ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోద్దు. మోసగాళ్లు కాల్ చేయొచ్చని కూడా అంది. లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్కేర్ వర్కర్లు, టెలికం వర్కర్లు, ప్రభుత్వ అధికారులమని కాల్స్ చేస్తుంటారని. జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ తెలిపింది. కాల్ చేసిన తర్వాత కేవైసీ అప్డేట్, కొత్త జాబ్ ఆఫర్లు, అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ మోసగాళ్లు చెప్పొచ్చని, నమ్మొద్దని బ్యాంక్ చెప్పింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ని ఉపయోగించాలని బ్యాంక్ సూచించింది. అలాగే తెలియని పోర్టల్స్లో పేమెంట్స్ నిర్వహించొద్దని తెలిపింది.