ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్ ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా జూనియర్ కాలేజీల పనిదినాలు తగ్గినందున సిలబస్ ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని తెలిపారు. తొలగించిన 30 శాతాన్ని సా.4 గంటల నుంచి 5 గంటల వరకు, ఖాళీ పీరియడ్స్ లో బోధించాలని సూచించారు. ఇక పాఠశాల విద్యలో ఇప్పటికే సబ్జెక్టుల వారీగా రెండేసి ఛాప్టర్స్ తగ్గించారు. ఈ మేరకు అకడమిక్ కేలండర్ ను విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా తగ్గించిన సిలబస్ వివరాలను ఉపాధ్యాయులకు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa