ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2017, 02:01 PM

హామీలు అమలు చేయని వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమ్మఘాట్‌ సెంటర్‌ లో వైఎస్‌ జగన్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే ముగిరిగిపోయినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తు‍న్నారని, కానీ, చంద్రబాబుకు ఓటు వేస్తే అది మురిగిపోతుందని జగన్‌ పేర్కొన్నారు.  'ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు వస్తాయని చంద్రబాబే చెబుతున్నారు. ఆ లెక్కన్న రాబోయేది మన పాలనే. మన పాలనలో కాకినాడ కౌన్సిల్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకుందాం' అని జగన్‌ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa