ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మం, న్యాయం వైపు నిలబడండి: వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2017, 02:02 PM

జాబు రావాలంటే బాబు రావాలన్నారు. లేకుంటే 2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించారు. ఒక్క ఉద్యోగం లేదు.  ఇప్పటికీ 39 నెలలు గడిచింది. అ లెక్కన్న ప్రతీ ఇంటికి చంద్రబాబు 78 వేలు బాకీ పడ్డార'ని జగన్‌ గుర్తు చేశారు. బెల్ట్‌ షాపులన్నీరద్దు చేస్తామన్నారు. కానీ, ఇప్పుడు వీధికొక బెల్ట్‌ షాపు కనిపిస్తోంది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?  పొదుపు మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని జగన్‌ ధ్వజమెత్తారు.  'రైతులకు భేషరతుగా రుణ మాపీ హామీ ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకపోగా కరెంట​ ఛార్జీలు విపరీతంగా పెంచారు. గతంలో 200 రూపాయలు వస్తే ఇప్పుడది 500 కి చేరింది. ఇది చాలదన్నట్లు ఇంటి పన్ను వెయ్యి రూపాయలకు పెంచారు. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మహానేత వైఎస్‌ఆర్‌ ఫీజు రియంబర్స్‌ ను అమలు చేస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చేసింది. ఆరోగ్యశ్రీ, 108లను నిర్విర్యం చేసేశారు. అందుకే హామీలు అమలు చేయని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరిన వైఎస్‌ జగన్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే కురక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడలే నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa