న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విక్టరీ కొట్టింది. బావన నియోజకవర్గం నుంచి ఆప్కు చెందిన రామ్ చందర్ గెలిచారు. ఆమ్ ఆద్మీ అభ్యర్థికి 59886 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి వేద ప్రకాశ్కు 35834 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు చెందిన సురేందర్ కుమార్కు 31919 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల కోసం తొలిసారి వీవీప్యాట్లను వాడారు. వీవీప్యాట్ అంటే వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈ విక్టరీ పట్ల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంగ్రాట్స్ చెప్పారు. కేజ్రీవాల్ కూడా తన ట్విట్టర్లో ఢిల్లీ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని బీజేపీ పార్టీ పేర్కొన్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa