ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశానికీ 'రావత్' చేసిన సేవలు అసాధారణమైనవి : రక్షణమంత్రి రాజ్‌నాథ్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 07:18 PM

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల  రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్య్వక్తం చేసారు.  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ జనరల్ రావత్ దేశానికి అసాధారణమైన సేవలు అందించారు'' వారి సేవలు ఎప్పటికి మరువం.. ''మొట్టమొదటి సీడీఎస్ జనరల్‌గా బిపిన్ రావత్ సాయుధ దళాల ఉమ్మడి భాగస్వామ్యం కోసం ప్రణాళికలను సిద్ధం చేశారు అని సోషల్ మీడియా ద్వారా బిపిన్ రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. . ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 13 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక ఉన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన బిపిన్ రావత్‌ను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తూ ఉండగా రావత్ మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa