న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది కేంద్రం. కొవిడ్ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చర్చించారు .కొవిడ్ -19 క్లినికల్ చికిత్సలో ఉపయోగించి 8 డ్రగ్స్ బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కేసులు పెరిగితే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా? అన్న అంశంపైనా సమీక్షించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, పీఎస్ ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేశారు.టెస్ట్ , ట్రాక్ , ట్రీట్ , వ్యాక్సినేట్ , కొవిడ్ నిబంధనలకు లోబడి ఉండటం.. అనే ఐదు సూత్రాలను ప్రధానంగా ప్రస్తావించారు రాజేశ్ భూషణ్ . ఇవే కరోనా నివారణకు మార్గాలని అన్నారు.హాట్ స్పాట్ లు, బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసుల అంశంపైనా సమీక్షలో చర్చించారు. పాజిటివ్ గా నిర్ధరణ అయిన బాధితుల సన్నిహితుల వివరాలను సేకరించి.. ప్రొటోకాల్ ప్రకారం టెస్టులు జరపాలని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa