ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకింగ్.. ఆఫీసుల్లో వాటిని చూపి మహిళలను వేధిస్తున్నారు!

national |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 01:41 PM

పని చేసే చోట మహిళలకు వేధింపులు నిరోధించడానికి కఠిన చట్టాలు అమలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అవి నిరర్థకంగా మారిపోతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తాజా అధ్యయనం రుజువు చేస్తోంది. కామాంధుల కారణంగా ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు పెరిగిపోతున్నారు. పని చేసే చోట మహిళలు వేధింపులకు గురి కాకుండా నిరోధించేందుకు భారత ప్రభుత్వం 2013లోనే చట్టం చేసింది. 10 మంది కన్నా ఎక్కువ మహిళలు పని చేస్తున్న కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఓ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలనే చట్టం ఉంది. అయినా ఈ హరాస్మెంట్లు ఆగక పోవడం శోచనీయం. తాజాగా నేషనల్ హుమెన్ రైట్స్ కమిషన్ విడుదల చేసిన రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.


పనిచేసే చోట వేధింపులు భరించలేక ఉద్యోగాలు మానేస్తున్న వారు 19.2 శాతం ఉన్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. వేధింపులను మౌనంగా భరిస్తున్న వారు 24 శాతం మంది ఉన్నారని పేర్కొంది. 47 శాతం మంది లైంగిక వేధింపులతో చట్టాన్ని ఆశ్రయిస్తుండగా, ప్రశ్నించే ధైర్యం చేయలేని వారు 19.5 శాతం, చట్టానికి పదును లేదని భావిస్తున్న వారు 65 శాతం,ఫిర్యాదు చేయడం వల్ల ఉద్యోగం కోల్పోయినవారు 34.3 శాతం మంది ఉన్నారు.


ఇక తమ ప్రైవేటు భాగాలు ప్రదర్శిస్తూ 24.2 శాతం వేధింపులకు గురి అవుతుండగా తాకడం ద్వారా 81 శాతం, ద్వంద్వార్థాలతో 61.6 శాతం, అసభ్యమైన వర్ణనలతో 80.4 శాతం, పనిభారం తగ్గించేసాకుతో 15.9 శాతం, బూతు జోక్స్‌ ద్వారా 45 శాతం, ప్రమోషన్లు ఆశ చూపి 17.6 శాతం, ఫోన్‌ సంభాషణ ద్వారా 44 శాతం, అసభ్యకర చూపుల ద్వారా 89 శాతం, బహుమతుల ద్వారా 26 శాతం, వేతనాల కోత ద్వారా 25.3 శాతం, తప్పులు వెతకడం ద్వారా 35 శాతం, అవమానించడం ద్వారా 17.2 శాతం, కఠినమైన బాధ్యతల ద్వారా 10.9 శాతం, ఇంక్రిమెంట్లను ఆపేయడం ద్వారా 10 శాతం మంది వేధింపులకు గురవుతున్నట్లు తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa