వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. ముచ్చటైన జంట. వీరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. కానీ ఇటీవల భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆ పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. పిల్లలతో పాటు భార్యను సైతం భర్తకు దూరం చేసింది. అన్యోన్యంగా సాగాల్సిన వారి జీవితం ఊహించని మలుపు తీసుకుంది. పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని కరూర్ జిల్లా కడవూర్ తాలూకాలోని పుసరిపట్టి గ్రామానికి చెందిన శక్తివేల్ కు శరణ్యతో 2015లో వివాహం జరిగింది. వీరికి
కనిష్క(6) పువిష(3) అనే కూతుళ్లు ఉన్నారు. శక్తివేల్ టెక్స్టైల్ వర్కర్ గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఇటీవల భార్య ప్రవర్తన తీరు కొత్త సమస్యలు తీసుకువచ్చింది. శరణ్య మానసిక సమస్య బారిన పడి తరచూ భర్తతో గొడవకు దిగేది. తాను ఒంటరిగా ఉంటానని ఎక్కడికైనా వెళ్లిపోతానని చెప్పేది. ఈ వింత ప్రవర్తనతో భర్త కోపం చేసేవాడు. అలా తరచూ ఇద్దరి మధ్య గొడవ జరిగేది.
ఈ క్రమంలో ఇటీవల శరణ్య తొందరపాటు నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు పిల్లల్లో ఒక పాపను తీసుకుని బయటకు వెళ్లింది. 100 అడుగుల లోతైన బావిలో ఆ చిన్నారిని విసిరేసింది. ఇంటికి వచ్చి మరో పాపను తీసుకెళ్లి తోసేసి తానూ అదే బావిలో దూకింది. ఆ తర్వాత నిద్రలో నుండి మెలుకువ వచ్చి చూసిన భర్తకు ఇంట్లో భార్య పిల్లలు కనిపించ లేదు.
దీంతో ఆందోళన చెందాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు బావిలో ముగ్గురి శవాలను చూసి శక్తివేల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జీవచ్ఛవాలుగా పడి ఉన్న ఉన్న త కూతుళ్ల తలచుకుని బోరున విలపించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa