సముద్ర తీరాల తీరుతెన్నులు అర్థం కావడం లేదు. ఓ పక్క పూడిమడక తీరం, రుషికొండ, విశాఖ సారగతీరాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. అంతేకాదు విశాఖ సాగరతీరానికి ముంపు ముప్పు పొంచి ఉందని ఇటీవల కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. జావెద్ తుఫాను కారణంగా ఆర్కే బీచ్ సమీపంలో వుడా చిల్డ్రన్ పార్కు గోడ ధ్వంసమైంది. ఎప్పుడూ ఊహించని విధంగా అలలు ముందుకొచ్చి బీచ్ కోతకు గురైంది. గతంలో పూడిమడక తీరంలో సముద్రం ముందుకొచ్చింది. అక్కడ మత్స్యాకారుల ఇళ్లను ముంచేసింది. ఇదిలావుండగా తూర్పుగోదావరి అంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి నెలకుంది.
అయితే నీరు 2కిలో మీటర్లు లోనికి వెళ్లడంతో స్థానికుల ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ సముంద్రం ముందుకు రావడమే గానీ వెనకకు ఇంతలా వెళ్లడం ఇదే తొలిసారి. బుధవారం అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది.
దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పడు ఇదే విషయం విశాఖలో చర్చనీయాంశమైంది. ఎప్పుడు సముంద్రం ఎలా మారుతోందో అర్థం కావడం లేదు. మత్స్యకారులు సాగరుడు చేస్తున్న చేష్టలకు విస్తుపోతున్నారు. రెండు కి. మీ మే సముంద్రం వెనక్కు వెళ్లడం ఏంటని ఫిషింగ్ హార్బర్లో మార్నింగ్ డిబేట్ ఇదే. విశాఖ వెంబడి సముంద్ర తీరం ఎప్పటికైనా ప్రమాదమే అంటున్న వార్తలకు. ఇప్పడు పూడిమడక. అంతర్వేది సముంద్రాల ముందుకు. వెనక్కు వెళ్లడం చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa