ధాన్యం కొనుగోలుపై జగన్ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నేరుగా ఆర్బీకేలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ పంటలు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటన చేశారు. వర్షాల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరుగుతుందని, దీంతో ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రావటం లేదన్నారు. ఇప్పటికే 2,30,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. ప్రతి ఆర్బీకేను మిల్లులతో అనుసంధానం చేశామని వెల్లడించారు. ఎక్కువగా తడిసిన ధాన్యం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేసి అక్కడ ధాన్యం కొనుగోలు పై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపు పై కేంద్రానికి అనుమతి కోసం లేఖ రాశామని వెల్లడించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రైతాంగం గురించి ఒక్కసారైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. భయాందోళనలకు గురి చేసి రైతులు ఎంతోకొంతకు ధాన్యం అమ్ముకుని నష్టపోవాలని చూస్తున్నారని చంద్రబాబుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa