ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం

national |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 08:36 PM

భారత టెస్ట్ వైస్-కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు-టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు, ఎందుకంటే ముంబైలో జట్టు నెట్ సెషన్‌లో అతని పాత  గాయం మళ్లీ బయటపడింది,  అతను ఎడమ చేతికి కూడా దెబ్బ తగిలింది.
దక్షిణాఫ్రికాకి వెళ్లే ముందు ముంబయిలో ఓ క్యాంప్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయగా.. ఆ క్యాంప్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. గత కొంతకాలంగా హిట్‌మ్యాన్‌ని తొడ కండరాల గాయం వేధిస్తోంది. తాజాగా మరోసారి ఆ గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత నేపథ్యంలో రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కి దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది.

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రియాంక్ పాంచాల్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa