కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆలయ పూజారి 37 ఏళ్ల మహిళను చెరకు గడతో కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన పార్వతి అనే మహిళ గత రెండు నెలలుగా తలనొప్పి సమస్యతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఆమెకు తలనొప్పి తగ్గలేదు. గాలి సోకడం వల్లే ఇలా ఆమెకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆమెకు తెలిసిన వాళ్లలో ఒకరు చెప్పారు. దీంతో పార్వతికి ఎక్కడ లేని భయం పట్టుకుంది. బెక్కా గ్రామంలోని ఆలయ పూజారి మనూని సంప్రదించింది. మనూ ఆ మహిళకు నయం చేస్తానని చెప్పి చికిత్సలో భాగంగా చెరకు గడతో కొట్టాల్సి వస్తుందని చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించడంతో చెరక గడతో ఆమె శరీరంపై, చేతులు కాళ్లు, తలపై కొట్టాడు. కొన్ని దెబ్బలు కొట్టగానే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హుటాహుటిన హసన్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా డిసెంబర్ 8న ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పూజారి మనూ కనిపించకుండాపోయాడు. మనూపై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa