ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జలతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 07:26 PM

సజ్జల రామకృష్ణారెడ్డి  ఉద్యోగ సంఘాల ఠీ నిర్వహించిన భేటీ ముగిసింది. పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎస్ కమిటీ నివేదికపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. చర్చలు ముగిసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు కోరినట్లుగా 45 శాతం పీఆర్సీ సాధ్యం కాదని సీఎస్ కమిటీ పేర్కొందన్నారు.
కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, అయితే ఉద్యోగులకు ఉత్తమ ప్యాకేజీ ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫార్సులు చేసిందని వెల్లడించారు. ప్రతిపాదిత ఫిట్‌ను (14.29%) పెంచే అవకాశం కూడా ఉందని సజ్జల వివరించారు. త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌ సమావేశమయ్యే అవకాశం ఉందని ఆ సమావేశంలో పూర్తి వివరాలతో ఒక నిర్ణయానికి రావచ్చు అని తెలిపారు సజ్జల.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa