పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. అనంతరం సజ్జల వారి అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సంఘాలతో సమావేశమైన సజ్జల రామకృష్ణారెడ్డి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వారికి వివరించారు. సజ్జల మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ నేపథ్యంలో నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ కానున్నారు అని సమాచారం.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. అధికారుల కమిటీ సిఫార్సులు ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా లేవన్నారు. 34 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్ మెంట్ సహజంగానే వస్తోందన్నారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఆమోదయోగ్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ఉద్యోగులు కోరినట్లు ఫిట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం అనంతరం.. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలతో సజ్జల సమావేశమయ్యారు. పీఆర్సీపై సీఎస్ ఇచ్చిన నివేదికను ఆమోదించాలని కోరగా.. నిరాకరించారు. సీఎస్ ఇచ్చిన నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం పీఆర్సీని అమలు చేయాలని కోరారు. 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 71 హామీలు అమలు చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
మరి ఇక ఈ విషయం పై జగన్ సర్కారు నేడు ఈ విధంగా స్పందిస్తుందో.. అని ఉద్యోగుల సంఘాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa