గవర్నర్ బిశ్వభూషణ్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేడు భేటీ కానున్నారు. రాజ్భవన్కు వెళ్లి సీఎం వైయస్ జగన్ దంపతులు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుస్తారని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 5: 30 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారు. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ కానున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్ వెంట ఆయన భార్య భారతి కూడా ఉంటారు. ఇది మర్యాదపూరక సమావేశంగా అధికారులు చెబుతున్నారు.
సుమారు అరగంట పాటు వారి మధ్య సమావేశం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ బిశ్వభూషణ్ కొద్దిరోజుల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పూర్తిగా కోలుకున్న తరువాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. రాజ్భవన్కు చేరుకున్నారు. విశ్రాంతి తీసుకుంటోన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం, పరామర్శించడం కోసం వైఎస్ జగన్, తన భార్య భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa