ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్లలో టీడీపీ సంఘీభావ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 04:27 PM

అమరావతి రైతుల పాదయాత్ర ఒక మహాప్రస్థానం అన మనకోసం, మన బిడ్డల కోసం. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన పాదయాత్ర అని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. న్యాయస్థానం నుండి దేవస్థానం మహాపాద యాత్ర తిరుపతి చేరుకున్న సందర్భంగా రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా బాపట్ల శ్రీనివాస సినిమా హాల్ నుండి చిల్ రోడ్ సెంటర్ వరకు రైతులు, నాయకులు, అభిమానులతో కలసి పాదయాత్ర చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు ఒక్కరు కూడా జంక కుండా అమరావతి రాజధాని కోసం తిరుమల దేవస్థానం వరకు రైతు లు పాదయాత్ర చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని అన్నారు. మూడు రాజధానులు పేరుతో రైతులను ప్రజలను ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చిల్ రోడ్ వద్ద గల శ్రీ రాముల వారి దేవాలయం వద్ద కొబ్బరికా యలు కొట్టి భగవంతుని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, రైతులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa