ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నగరంలో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ హాజరుకానున్నారు. శుక్రవారం సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతుంది.విశాఖపట్నం చేరుకున్న తర్వాత... సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఎడి జంక్షన్లో నిర్మించిన ఎన్ఎడి ఫ్లైఓవర్, విఎంఆర్డిఎ అభివృద్ధి చేసిన 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్య వివాహ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 6.20 గంటలకు వుడా పార్కుతోపాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన 4 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు పీఎం ప్యాలెస్ వైజాగ్ కన్వెన్షన్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్కు సీఎం హాజరుకానున్నారు. రాత్రి 8 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం వరకు తిరుగు ప్రయాణం సాగుతుంది.కాగా, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తగు ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa