ట్రెండింగ్
Epaper    English    தமிழ்

34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పిన సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 07:22 PM

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంతో ఉదోగుల భేటీ తర్వాతే పీఆర్సీ  ప్రకటిస్తామని స్పష్టం చేసారు. అయితే క‌రోనా, ఆర్థిక సంక్షోభం వల్ల 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. వీలైనంత త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. 27శాతం ఐఆర్ ఇస్తున్నామ‌న్నారు. ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు సజ్జ‌ల‌.
సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఐఆర్ ను అమలు చేస్తూ ఐఆర్ కు రక్షణ ఉండేలా చూస్తామ‌ని… రేపటికి పీఆర్సీ పై చర్చల ప్రక్రియ పూర్తికావచ్చన్నారు. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఉండవచ్చు లేదా సోమవారం చర్చలు.. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన ఉంటుంద‌ని సజ్జల ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగులు ఎవ‌రు కూడా ఆందోళన చెంద‌నవ‌స‌రం లేద‌ని స‌జ్జ‌ల చెప్పారు.
ఏపీ జేఏసీ, ఏపీ జేఎసీ అమరావతి నేతలు 55 శాతం 'పీఆర్సీ' ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం 34 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు మానిటరీ బెనిఫిట్స్ ను వచ్చే ఏడాది అక్టోబర్ నుండి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ విషయమై కూడా ఉద్యోగ సంఘాల నేతలు పట్టు వీడడం లేదు.పీఆర్సీ విషయమై ఇప్పటికే ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ  సంఘాలు నిరసనకు దిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa