ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతమార్పిడుల నిరోధక బిల్లు ఆమోదించిన కర్ణాటక శాసనసభ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 11:23 AM

విపక్షాల తీవ్ర నిరసనల మధ్య కర్ణాటక శాసనసభ.......మతమార్పిడుల నిరోధక బిల్లును ఆమోదించింది. కర్ణాటక న్యాయశాఖ మంత్రి J.C.మధుస్వామి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు-2021 పేరుతో రూపొందించిన బిల్లుకు కర్ణాటక శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరి వర్గానికి చెందిన వారిని మతం మారేలా ప్రోత్సహిస్తే......నేర తీవ్రతను బట్టి మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష, 25వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఎస్సీ-ఎస్టీ వర్గాల్లోని మైనార్టీలు, మహిళలను మతం మారేలా ప్రోత్సహిస్తే పదేళ్ల జైలు శిక్ష, 50వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కర్ణాటకలో హిందూ జనాభా తగ్గి, క్రైస్తవ జనాభా పెరుగుతోందనే ఆందోళనతోనే ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. జనాభా లెక్కలపై ప్రభుత్వ వాదన సరికాదని అన్నారు. అయితే విపక్షాల ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తోసిపుచ్చారు. ఎస్సీ-ఎస్టీలకు అదనపు రక్షణ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు తెలిపారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa