తిరుమల కల్తీ నెయ్యి కేసులో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి, అసలు నెయ్యే కాదంటూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ మధ్య తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై మరోసారి మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ మద్దతుదారుడు, కమెడియన్ కిరాక్ ఆర్పీ పై.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకు చెందిన వైసీపీ నేత కొరిటిపాటి ప్రేమ్ కుమార్.. కిరాక్ ఆర్పీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని ఆరోపిస్తూ.. గతంలో కిరాక్ ఆర్పీ, మాజీ మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదిక నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తెచ్చిన ప్రేమ్ కుమార్.. కిరాక్ ఆర్పీపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పిందన్న ప్రేమ్ కుమార్.. కిరాక్ ఆర్పీని ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇష్టానుసారం మాట్లాడిన కిరాక్ ఆర్పీని.. తాము అధికారంలోకి వస్తే పందిని కోసినట్లు నరికి కోస్తామంటూ ప్రేమ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి పాలనలో ఏం మాట్లాడినా మనోభావాలు దెబ్బతిన్నాయని జైలుకు పంపుతున్నారని.. కిరాక్ ఆర్పీ మాటలతో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్న కిరాక్ ఆర్పీని.. పందిని నరికి కోసినట్లు.. కోస్తాం ఖబడ్దార్ అంటూ ప్రేమ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో కిరాక్ ఆర్పీ తెలుగుదేశం పార్టీ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు నుంచి టీడీపీ మద్దతుదారుడిగా ఉన్న కిరాక్ ఆర్పీ.. ఎన్నికల సమయం నుంచి పూర్తిస్థాయిలో టీడీపీ తరుఫున రాజకీయాల్లో ఉన్నారు. ఈ క్రమంలో విపక్ష వైసీపీ నేతలపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలపైనా కిరాక్ ఆర్పీ స్పందిస్తు్ంటారు. ఈ విధంగా తిరుమల లడ్డూ వ్యవహారం సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసి సిట్.. లడ్డూ తయారీకి సరఫరా చేసిన నేయిలో అసలు పాలే లేవని తేల్చింది. పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో చేసిన పదార్థాన్ని నెయ్యి అంటూ సరఫరా చేసినట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa