ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్రగడ టీడీపీలో చేరబోతున్నారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 02:49 PM

AP: పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పతో వైసీపీ కీలక నేత ముద్రగడ పద్మనాభం భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ముద్రగడ కూటమిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత నెమ్మదిగా వస్తోంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని ముద్రగడకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఆ పనిలో చురుకుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు చినరాజప్పను కలవడంపైనే చర్చ సాగుతోంది. దాంతో ముద్రగడ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa