ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 1 నుంచి మారునున్న రూల్స్ ఇవే

national |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 02:22 PM

జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఏటీఎం ఛార్జీలు: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే 1 జనవరి 2022 నుంచి కొత్త ఛార్జీలు చెల్లించాలి. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన తర్వాత ప్రస్తుతం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్‌టీ చెల్లిస్తున్నారు కస్టమర్లు. జనవరి 1 నుంచి రూ.21 + జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.


గ్యాస్ ధరలు: ఆయిల్ కంపెనీలన్నీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని ప్రతీ నెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నెల మధ్యలో కూడా ధరల్ని మారుస్తుంటాయి. మరి కొత్త ఏడాదిలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది జనవరి 1న తెలుస్తుంది. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.


పీఎఫ్ రూల్స్: పీఎఫ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారు 2021 డిసెంబర్ 31 లోగా నామినీ వివరాలు అప్‌డేట్ చేయాలని ఈపీఎఫ్ఓ కోరింది. ఇ-నామినేషన్ ఫైల్ చేయకపోతే ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సిన ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తొచ్చు.


కవాసాకి ఇండియా: కవాసాకి ఇండియా మోటార్ సైకిళ్ల ధరల్ని రూ.23,000 వరకు పెంచింది. కొత్త ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2021 డిసెంబర్ 31 లోగా బుక్ చేసి 45 రోజుల్లో డెలివరీ తీసుకునే కస్టమర్లకు పాత ధరలే వర్తిస్తాయని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


హీరో మోటో కార్ప్: హీరో మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని పెంచింది హీరో మోటోకార్ప్. పెరిగిన ధరలు 2022 జనవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి. హీరో మోటోకార్ప్ స్కూటర్ లేదా బైక్ కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధరపై రూ.2,000 వరకు అదనంగా చెల్లించాలి. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు బైకులు, స్కూటర్లపై రూ.8,000 వరకు ధర పెంచింది హీరో మోటోకార్ప్.


ఐటీ ఫైల్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


కొత్త ట్యాక్స్ రూల్స్: వ్యాపారులకు 2022 జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్ అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి.


క్యాష్ డిపాజిట్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa