అతుక్కుని పుట్టిన కవలలు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 2003 జూన్ 14న ఇద్దరు కవలలు అతుక్కుని పుట్టారు. వారి గుండె, కిడ్నీలు, చేతులు, వెన్నెముక వేర్వేరుగా ఉన్నాయి. కానీ లివర్, గాల్ బ్లాడర్, కాళ్లు మాత్రం ఇద్దరికీ కలిపి ఉన్నాయి. దీంతో పుట్టిన వెంటనే తల్లిదండ్రలు వారిని ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. వారికి చికిత్స చేయించే ప్రయత్నం చేసింది. వాళ్లను వేర్వేరుగా చేసేందుకు ఉన్న అవకాశాలను ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు కూడా పరిశీలించారు. కానీ సర్జరీ చేస్తే ఒక్కరు కూడా బతకడం కష్టమని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ ఇద్దరూ అలానే పెరిగారు. వారిని పంజాబ్లోని ఆలిండియా పింగల్వారా ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుంది. వారికి సోహ్నా, మోహ్నా అని పేర్లు పెట్టారు.
అతుక్కుని పుట్టినా ఆ ఇద్దరు పిల్లలు ఎంతో మనో ధైర్యంతో ముందుకు సాగరు. ఎలక్ట్రికల్ ఇంజనీరంగ్లో డిప్లొమా చదివారు. ప్రైవేట్గా ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడం మొదలుపెట్టారు. అలాగే పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జాబ్ సాధించాలనే పట్టుదలతో ప్రయత్నం చేసి అనుకున్నది సాధించారు. డిసెంబర్ 20న అమృత్సర్లో ఉన్న 66 కేవీ సబ్ స్టేషన్లో జాబ్లో చేరారు. ఈ అవిభక్త కవలలిద్దరినీ డిజేబుల్ కోటా రిక్రూట్ చేసుకున్నామని అధికారులు తెలిపారు. వారిద్దరికీ కలిపి రూ.20 వేల జీతం ఇవ్వనున్నట్లు చెప్పారు. సోహ్నా, మోహ్నా పింగల్వారా సొసైటీ నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa