ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను రూ.5 వేలకు అమ్మిన భర్త

national |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 01:43 PM

రాజస్థాన్ లో దారుణం జరిగింది. మాల్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను 5 వేల రూపాయలకు ఇద్దరు వ్యక్తులకు అమ్మాడు. ఒప్పందం ప్రకారం ఆ వ్యక్తులు ఆయన భార్యతో గడుపుతారు. ఈ విషయం భార్యకు తెలియదు. ఇంతలోనే ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు. వారితో గడపాలని భార్యకు భర్త చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఆమె నిరాకరించడంతో భర్తతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెను విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె పై వారు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేస్తున్నారు. వారం క్రితం ఈ ఘటన జరిగినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa