ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఎడాది చేదునింపుతుందా...వస్తువుల ధరలు కొండెక్కుతాయా

national |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 02:44 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  వార్షిక  బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టే  పన్నులు వాస్తవానికి వివిధ వస్తువల  ధరలు  పెరిగేందుకు కారణమవుతుంది. కానీ  ఇందుకు భిన్నంగా కొత్తగా  రానున్న ఏడాదితో  వివిధ రకాల వస్తువులపై  ధరలు  పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే నూతన సంవత్సరంలో పలు వస్తువుల ధరలు పెరగొచ్చనే అంచనాలున్నాయి. కొన్ని పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కన్సూమర్ గూడ్స్ కంపెనీలు వచ్చే కొన్ని నెలలల్లో వస్తువుల ధరలను పెంచొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం, లాజిస్టిక్స్ ఖర్చులు పైకి చేరడం, సరఫరా అడ్డంకులు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


హిందుస్తాన్ యూనిలివర్, డాబర్, బ్రిటానియా, మారికో వంటి పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను గత రెండు త్రైమాసికాల్లో 5-12 శాతం మేర పెంచేశాయి. ఇప్పుడు మళ్లీ కొత్త ఏడాదిలో ధరలు పెంచేందుకు సిద్ధం అవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో ఎడిబుల్ ఆయిల్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు వస్తువుల ధరలను వచ్చే మూడు నెలల కాలంలో 4-10 శాతం వరకు పెంచొచ్చని తెలుస్తోంది. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పటికే 3-5 శాతం మేర ధరలు పెంచాయి. ఇవి ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ ధరలను మళ్లీ 6-10 శాతం వరకు పెంచేందుకు రెడీగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 2020 నుంచి చూస్తే కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. అలాగే పలు వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే వాహన ధరలను పలు మార్లు పెంచేశాయి. అయితే మళ్లీ ఇవి కొత్త ఏడాదిలో ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. హీరో మోటొకార్ప్ ఇటీవలనే ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. టూవీలర్ ధరల పెంపు జనవరి 4 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఇంకా పలు వాహన కంపెనీలు ధరలు పెంచబోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa