ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకిచ్చిన వరణుడు.. ఆట రద్దు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 06:04 PM

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. సెంచూరియన్‌ లో వర్షం పడటంతో రెండో రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అంపైర్లు ముందుగా ప్రకటించారు. కానీ, వర్షం ఆగకపోవడం వల్ల ఆటను రద్దు చేశారు. తొలి రోజు ఆటలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (122*) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అతనితో పాటు అజింక్య రహానె (40*) క్రీజులో ఉన్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa