ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తెలుగు సినిమా పరిశ్రమ వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఏపీలోని సినిమా థియేటర్స్లో టికెట్ రేట్స్ను తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం స్పెషల్ జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినీ పరిశ్రమంలో కాస్త నిరాశ నెలకొంది. ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా వ్యాపారం పూర్తిగా దెబ్బ తింటుందని సినీ పెద్దలు, నిర్మాతలు అందరూ ప్రభుత్వంతో చర్చలు జరపాలని అనుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కావాల్సిన కమిటీని సిద్ధం చేసుకోవాలని విషయం పెద్దలకు తెలిసింది. దాంతో అందరూ చర్చించుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి సినీ పరిశ్రమ 17 మందితో కూడిన ఓ కమిటీ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో ఉండబోయే 17 మంది సభ్యుల్లో 6 మంది ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఐదుగురు, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 6గురికి స్థానం ఉంటుంది. మరి ఈ సభ్యులు ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏపీ హోం శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్కు దీని గురించి తెలియజేస్తూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లెటర్ రాసింది. సినీ పరిశ్రమలోని సమస్యలు, టికెట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చించనుంది.
అలాగే మరో వైపు మంగళవారం రోజున ఏపీ ప్రభుత్వానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి ప్రతిపాదనలు అందజేశారు. అందు కోసం వారు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్నినానిని కలిశారు. గంటన్నర పాటు మంత్రితో వీరు చర్చలు జరిపారు. ఇందులో సినిమా టికెట్స్ ధరలు పెంచాలని కోరారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సంఘాలు ఇచ్చిన విజ్జప్తిలను పరిశీలిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం తరపున కూడా ఓ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశామని నాని తెలిపారు. త్వరలోనే రివ్యూ చేసి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్ని నాని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa