ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 12:41 PM

2026వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను అందుకున్న విజేతలకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో తమ విశిష్ట సేవలతో దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గౌరవం తెచ్చిన ప్రతి విజేత ప్రశంసనీయులని ఆయన అన్నారు. మీరు సాధించిన ఈ అత్యున్నత గుర్తింపు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతల సేవలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగి, దేశ అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షిస్తూ, వారి ప్రయాణం మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa